శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:23 IST)

ఏపీ-తమిళనాడుకు బస్సు సర్వీసులు యధాతథం!

ఏపీ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏపీ బస్సులను తమిళనాడుకు రాకుండా అక్కడి సంఘాలు అడ్డుకోవడంతో బస్సులా ఆపేసిన సంగతి తెలిసిందే. 
 
అదే విధంగా తమిళనాడు బస్సులను చిత్తూరు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో రెండు ఆర్టీసీలకు నష్టం వస్తోంది. ఎన్‌కౌంటర్‌ విచారణ వేగం పుంజుకోవడంతో ఇరు రాష్ట్రాలు ఆందోళన విరమణతో నేటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.