గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (07:28 IST)

OLXలో టీడీపిని అమ్మకానికి పెట్టారు... ఎమ్మెల్యే రోజా సెటైర్లు

తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీని అమ్మేందుకు OLXలో పెట్టారని రోజా ఎద్దేవా

తెలుగుదేశం పార్టీని వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి టార్గెట్ చేసారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీని అమ్మేందుకు OLXలో పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. అసలు తెదేపా ఎక్కడుందీ అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీ అయిపోయిందనీ, ఆ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలకు ఆశలు చూపి వలవేసి లాగేస్తున్నారని విమర్శించారు. అసలు ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ లేదని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నది వివిధ పార్టీల సమూహమనీ, అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 30 మంది ఉంటే, భాజపా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాగడంతో వారు కూడా అందులో భాగస్వామ్యమయ్యారన్నట్లు ఆమె కామెంట్లు ఉన్నాయి. మొత్తమ్మీద వివిధ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో పాలన సాగిస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.