శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 25 మే 2016 (21:36 IST)

​నేనా...గ‌న్‌మెన్‌ని కొట్టానా... యాక్సిడెంట‌ల్‌గా జ‌రిగిపోయిందంతే... క‌ర‌ణం బ‌ల‌రాం(Video)

ఒంగోలు: ఒంగోలు టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం మీడియాపై ఫైర్ అయ్యారు. నేనా...గ‌న్ మేన్‌ని కొట్టానా... ఏదో యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందంతే అని వివ‌ర‌ణ ఇచ్చారు. మీడియాలో నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. ఓ పత్రిక, ఓ చానల్ పనికట్టుకుని కట్టుకథలు రాస్తున్నాయి. ఇప్పటికైనా అవాస్తవాలు రాస్తున్నవారు తమ పద్ధ‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు బ‌ల‌రాం.
 
ఒంగోలులో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ఎవరినైనా ఎక్కువ చేసి చూపించడానికి తనను తక్కువచేసి చూపడం సరికాద‌ని, మినీ మహానాడులో జరిగింది ఒకటి, మీడియా రాసింది మరొకట‌ని చెప్పారు. చంద్రబాబు తనను పిలిచి మాట్లాడారని, మందలించారనడం వాస్తవం కాద‌ని, అస‌లు గన్‌మెన్‌ను కొట్టాననడం సరికాదు, ఏదో అలా జరిగిపోయింద‌న్నారు. 
 
ఇప్పుడు పార్టీలోకి వచ్చినవారిలాగా తాను పార్టీలు మార్చన‌ని ప‌రోక్షంగా ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌ని ఉద్దేశించి ఎత్తిపొడిచారు. మినీ మహానాడులో జరిగినదంతా పనికట్టుకుని చేసినదికాదు, యాక్సిడెండల్‌గా జరిగిపోయిందంతే అని కరణం బ‌ల‌రాం వివ‌ర‌ణ ఇచ్చారు.