శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 28 మే 2016 (16:47 IST)

టీడీపీ తమ్ముళ్లు ఆ విధంగా 'గుర్రు'పెట్టి ముందుకు పోతున్నారు...(Video)

తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తీస్తున్న కునుకుపాట్లు అన్నీఇన్నీ కావు. నిన్నటి నుంచి నిరంతరాయంగా మహానాడు జరుగుతుండటంతో నిద్రలేకుండా నాయకులు సభలోనే తూలుతున్నారు. ప్రధానంగా ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌లు మహానాడులో నిద్రపోతూనే కనిపించారు.
 
నిద్రపోతున్న సీనియర్‌ నేతలను చూసిన కార్యకర్తలు కాసేపు నవ్వుకున్నారు. మహానాడు వంటి కార్యక్రమంలో నేతలు నిద్రపోవడం ఏంటో అర్థం కాక మరికొంతమంది సీనియర్‌ నేతలు ఆలోచిస్తూ ఉండిపోయారు. 
 
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహానాడు కొనసాగుతుండడంతో పాటు శనివారం ఉదయాన్నే తిరుమల శ్రీవారిని పలువురు సీనియర్ నేతలు దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేచి దర్శనానికి వెళ్ళడంతోనే వారికి నిద్రలేకుండా పోయిందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 
తిరుపతిలో పరిటాల సునీత పుట్టినరోజు 
మరోవైపు.. తిరుపతిలో పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పరిటాల అభిమానుల మధ్య ఆమె పుట్టినరోజు వేడుకులను చేసుకున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత నేరుగా తిరుచానూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ కేక్‌ చేసిన సునీత బంధువుల మధ్య వేడుకలను జరుపుకున్నారు. అధికసంఖ్యలో పరిటాల అభిమానులు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.