శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జులై 2016 (20:06 IST)

ఏపీలో ప్రత్యేక హోదా అనేది ఓ అంటువ్యాధిలా పాకింది... సీఎం రమేష్

ఏపీ ప్రత్యేక హోదా పైన రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ... ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. దాని ఫలితంగానే ఇవాళ ప్రత్యేక హోదా కోసం కష్టాలు పడుతున్నాం. ఆంధ్ర

ఏపీ ప్రత్యేక హోదా పైన రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ... ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. దాని ఫలితంగానే ఇవాళ ప్రత్యేక హోదా కోసం కష్టాలు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది ఓ వ్యాధిలా అంటుకుపోయింది. కాబట్టి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి.
 
ఆనాడు తిరుపతిలో నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. ప్రజలు ఆ హామీలను విశ్వసించి ఏపీలో తెదేపాకు, కేంద్రంలో భాజపాకు అధికారాన్ని కట్టబెట్టారు. కొంతమంది ప్రత్యేక హోదాను అడిగేందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. మా నాయకుడు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారు. 
 
నగరజీవులు ఆంధ్రలో తక్కువ, అందువల్ల వారి తలసరి ఆదాయం తక్కువ కాబట్టి ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువ. పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఆ సమస్య లేదు. అవన్నీ ధనిక రాష్ట్రాలు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయమని కేంద్రమంత్రులను అభ్యర్థిస్తున్నా. ఇక్కడ సభ్యులందరికీ దండం పెడుతున్నా అంటూ సీఎం రమేష్ తన ప్రసంగాన్ని ముగించారు.