శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (13:51 IST)

రూపాయికే చౌక ధర బియ్యం ఎందుకు ఇవ్వాలి: జేసీ దివాకర్ రెడ్డి

రూ.5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం అనంతపురంలో జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి పథకం వ్యవసాయానికి అనుసంధానిస్తేనే ఉపయోగం ఉంటుందని జేసీ అన్నారు. 
 
ప్రభుత్వం కిలో బియ్యం రూ.1కే దారిద్యరేఖకు దిగువున జీవిస్తున్న నిరుపేదలకు అందిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ రూ. 5లు పెట్టి టీ తాగుతున్నప్పుడు ... కేజీ బియ్యం మాత్రం రూ1కే ఇవ్వడం సమంజసం కాదని జేసీ వ్యాఖ్యానించారు.