శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:53 IST)

తెదేపా మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్లు రావు... ఆప్ లెక్క వేరే... జగన్

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచిందనీ, అదే మన రాష్ట్రంలో టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదన్నారు. 
 
అందువల్ల వారిపై వడ్డీ భారం రూ. 12 వేల కోట్లు పడిందని దాన్ని ఎవరు తీర్చుతారని మండిపడ్డారు. ఈ భారం రైతులపై పడటానికి కారణం బాబేనన్నారు. రైతులకు మేలు చేస్తానన్న చంద్రబాబు వారి కోసం ఖర్చు పెడుతున్నది శూన్యం అంటూ మండిపడ్డారు.