బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (13:37 IST)

పాఠశాల మరుగుదొడ్డిలో టీచర్.. టీచరమ్మ రాసలీలలు... హెచ్ఎం ఆత్మహత్యాయత్నం!

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఓ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్, టీచరమ్మలు రాసలీలల్లో నిమగ్నమయ్యారు. అదీకూడా పాఠశాల మరుగుదొడ్డిలో వీరిద్దరు శృంగారం కొనసాగిస్తూ విద్యార్

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఓ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్, టీచరమ్మలు రాసలీలల్లో నిమగ్నమయ్యారు. అదీకూడా పాఠశాల మరుగుదొడ్డిలో వీరిద్దరు శృంగారం కొనసాగిస్తూ విద్యార్థుల కంటపడ్డారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ ప్రధానాధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ప్రధానోపాధ్యాయురాలిని మందలించడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తంజావూరు జిల్లా పిన్నయూర్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయురాలితో పాటు మదియళగన్ (35) అనే టీచర్ జ్యోతిలక్ష్మి (42) అనే ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. వీరిద్దరు ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. దీంతో తమ ఏకాంత జీవితాన్ని పాఠశాలలోనే గడుపుతూ వచ్చారు. 
 
ముఖ్యంగా హెచ్ఎం సెలవు పెట్టినా.. ఏదేని పనిపై బయటకు వెళ్లినా.. ఈ ఇద్దరు పాఠశాల మరుగుదొడ్లోకి వెళ్లి శృంగారంలో పాల్గొంటూ వచ్చారు. ఈ విషయం పలువురు విద్యార్థుల దృష్టిలో పడింది. ఇది ఆనోటా.. ఈనోటాకు వెళ్లి.. గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళన చేయడమే కాకుండా, డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డీఈవో.. టీచర్, టీచరమ్మలను సస్పెండ్ చేయగా, హెచ్ఎంను బదిలీ చేశారు. బదిలీని తట్టుకోలేని హెచ్ఎం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.