గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (16:00 IST)

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికుంది: కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. 
 
మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణమాఫీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. 
 
జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ విమర్శలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్లో చేరిన వారిని పవిత్రులు అనడం, బీజేపీలో చేరినవారిని పాపులు అనడం టీఆర్ఎస్ వారికి పరిపాటిగా మారిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా జగ్గారెడ్డి బీజేపీలో చేరడం అదేదో ఘోరమైన విషయంలా టీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.