బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (19:03 IST)

మోడీకి కేసీఆర్ లేఖ: మహిళలకు 33 శాతం సీట్లివ్వండి సార్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభలలో సీట్ల సంఖ్య పెంచి, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
ఓబిసిలకు కూడా చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఓబిసిల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తీర్మానం చేసినట్లు కేసీఆర్ మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.