శ్రీశైలమే కాదు.. నాగార్జున సాగర్లోనూ టి. విద్యుత్ ఉత్పత్తి!
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం వివాదాస్పదంగా మారినా.. విద్యుత్ ఉత్పత్తిని టి. సర్కారు కొనసాగిస్తూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు మాత్రమే గాకుండా ప్రస్తుతం టి. సర్కారు నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది.
ప్రస్తుతం నాగార్జునసాగర్లో 27వేల క్యూసెక్కుల నీటితో తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు.
సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే నాగార్జున సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు.