శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (18:22 IST)

వనితా రెడ్డి బతుకే ఇంతే.. మనవరాలిని మేమే పెంచుకుంటాం: విజయ్ తండ్రి

హాస్య‌న‌టుడు విజ‌య్‌సాయి భార్య, తన కోడలు వనితా రెడ్డి బ‌తుకంతా ఇలా బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని విజయ్ తండ్రి సుబ్బారావు విమర్శించారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో మూడ

హాస్య‌న‌టుడు విజ‌య్‌సాయి భార్య, తన కోడలు వనితా రెడ్డి బ‌తుకంతా ఇలా బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని విజయ్ తండ్రి సుబ్బారావు విమర్శించారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో మూడు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన వనితా రెడ్డి.. తాజాగా విజయ్ సాయి వేరొక మహిళతో సన్నిహితంగా వున్న ఫోటోలను విడుదల చేసింది. 
 
ఈ ఫోటోలపై విజయ్ తండ్రి స్పందిస్తూ... ఆ ఫొటోల‌లో త‌న కుమారుడితో ఉన్న‌ అమ్మాయి ఎవరో తెలియరావాలని చెప్పారు. వనితా రెడ్డి ఈ ఫోటోలను కోర్టులోనే ఇచ్చిందని తెలిపారు. వనితారెడ్డి బతుకంతా ఇతరులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుకోవడమేనని విజయ్ తండ్రి విమర్శించారు. వ‌నితారెడ్డి చేసే ఆరోప‌ణ‌ల్లో నిజం లేదని, కోర్టులో ఇచ్చిన ఫొటోల‌నే మ‌ళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది. 
 
మీడియా దృష్టిని మరలించేందుకు వనితారెడ్డి ప్రయత్నిస్తోందని విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. తన కుమారుడు కుందనను తమ వద్దే పెంచాలని ఆశపడ్డాడని.. అతడి చివరి కోరికను నెరవేర్చేందుకు పోరాడుతున్నామని తెలిపారు. మనవరాలు కుందనను అపురూపంగా పెంచుకుంటామని సుబ్బారావు అన్నారు. వనితా రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలేస్తోందని.. అసత్య ఆరోపణలు చేస్తుందని.. చివరికి విజయ్ తల్లిపై కూడా అవాస్తవ ఆరోపణలు చేస్తుందన్నారు. విజయ్ సాయి కేసులో పోలీసులు నిజానిజాలేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.