గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (13:13 IST)

కేంద్రంతో కయ్యానికి దిగితే చేతికి చిచ్పే గతి : టీజీ వెంకటేష్

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంతో కయ్యానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అంటున్నారు. అందువల్ల ప్రత్యేక హోదా కోసం ఆచితూచి అడుగులు వేయాలని, హోదా సాధ్యం కాకపోతే ఆ లోటును భర్తీ చేసేలా కేంద్రం నుంచి నిధులు పొందాలన్నారు. 
 
ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల్లోనే భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై ఆయన సోమవారం స్పందించారు. బీజేపీతో విభేదిస్తే రాష్ట్రానికే నష్టమని సూచించారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబులను దూషించినా హోదా రాదన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధించుకోవాలని హితబోధ చేశారు. రాయలసీమలో రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్ఘాటించారు.