శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (21:52 IST)

ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు అనంతలోకాలకు..

ఈత సరదా వారి ప్రాణాలను తీసింది. చిన్న పిల్లలు సరదాగా ఈత కొడుతూ చెరువులో మునిగి చనిపోయారు. విజనగరం జిల్లాలో జరిగిన విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కొత్తవలస మండలంలోని రావి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వల్ల రావిచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ముమ్మరంగా గాలిస్తున్నారు.