శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:23 IST)

ముహూర్తం ఖరారు: కారు ఎక్కనున్న తుమ్మల నాగేశ్వరరావు!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, 150 మంది సర్పంచ్‌లు, 140 మంది ఎంపిటిసిలు, 15 మంది జడ్పీటిసిలు టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది.