గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (11:08 IST)

జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో మాత్రం హుండీ వసూళ్లు భారీగా చేరాయి. జూన్ నెలలో మాత్రం వంద కోట్లకు పైగా శ్రీవారికి నగదు కానుకగా వచ్చి చేరింది.

జూన్ నెలలో మాత్రం ఈ ఏడాది భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపైనున్న హోటళ్లు, కాటేజ్‌లు నిండిపోయాయి. 
 
రోడ్లపైనే చాలామంది శ్రీవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రస్తుతం మోస్తరుగా భక్తులు కొండపై దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం గత ఏడాది జూన్ కంటే భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇంకా గత ఏడాది జూన్ నెలలో 95 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తే.. ఈ ఏడాది జూన్ నెలలో ఒక కోటి 13 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.