గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 2 మే 2016 (16:52 IST)

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తా .. ఆరుగురికి తీవ్రగాయాలు

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని సోమా సదన్‌ వద్ద సోమవారం ఓ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. లైసెన్స్ లేకుండా ట్రాక్టర్‌ నడపడమేకాకుండా యేసు అనే మరో వ్యక్తి పేరు చెప్పిన డ్రైవర్‌ నారాయణ స్వామిని ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
గాయపడిన వారిలో మధు, చిన్నారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరుపతి రుయాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. గాయపడిన వారు ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.