శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (09:50 IST)

నేడు ప్రమాణస్వీకారం చేయనున్న వైసిపి ఎమ్మెల్సీలు

ఇటీవల శాసనమండలికి ఎన్నికైన వైసీపి ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ తో వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి చాంబర్‌లో పదవీ ప్రమాణం చేస్తారు. దీంతో మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య మరోరెండు పెరిగింది.