శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:02 IST)

టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయలేకపోయాం: పొన్నాల

రాష్ట్రంలో పార్టీ సంస్థాగత పరిస్థితిపై ఎవరేం మాట్లాడుతున్నారో అధిష్టాన వర్గం అంతా గమనిస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెరాసకు ధీటుగా ప్రచారం చేయలేక పోయామని పొన్నాల అంగీకరించారు. తన పదవి పోతుందన్న వ్యాఖ్యలను అలా మాట్లాడిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
 
పార్టీ నేతల మధ్య సమన్వయం పెరగాలన్నారు. ఎన్నికల ప్రణాళిక విడుదల ఆలస్యం కావడం ఇబ్బందిగా మారిందని పొన్నాల తెలిపారు. తెలంగాణ ఇవ్వగానే పార్టీ అధినేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో సభ పెట్టి ఉంటే మంచి ఊపు వచ్చి ఉండేదన్నారు. తెరాస ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.