ఏపీ రాష్ట్రంలో 66వ గణతంత్ర వేడుకలు: టీటీడీకి ఫస్ట్ ప్రైజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థాన శకటంతో ప్రారంభమైన ప్రదర్శన విశేషంగా జరిగింది.
వ్యవసాయ, నీటిపారుద, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పౌరసరఫరాలు, జాతీయ ఆహార భద్రత సహా పలు శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శన అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి బహుమతి అందుకుంది.
అలాగే వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, సాగునీటి శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి. ఆయా శాఖలకు సంబంధించిన కమిషనర్లు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.