గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (11:59 IST)

తితిదే బోర్డులో తెలంగాణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డికి చోటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అరికె నర్సారెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అరికెల నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ, ఆయన అలకబూనిన సంగతి తెలిసిందే. నేతలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్‌పై ఒంటరి పోరాటం చేస్తున్నానని అరికెల వాపోయారు కూడా. తన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో అరికెలను టీడీపీ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.