శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (17:15 IST)

తుమ్మల టీఆర్‌ఎస్‌లోకి: జలగం వర్సెస్ తుమ్మల!?

సుదీర్ఘకాలంగా టీడీపీ నేత, ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉండిన తుమ్మల నాగశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నారు. సత్తుపల్లిలో తుమ్మల అభిమానులు రా కదలిరా.. అంటూ తుమ్మలను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు పెట్టేశారు. 
 
దీనిపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడుతూ ఎవరు పార్టీలోకి వచ్చినా తనకు ఢోకా లేదని, తన ప్రాధాన్యత తగ్గదని వ్యాఖ్యానించారు. తుమ్మల టిఆర్ఎస్‌లో చేరినా తనకు ఇబ్బంది లేదన్నారు. 
 
కాగా గత మూడు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లాలో జలగం వర్గానికి, తుమ్మల వర్గానికి సరిపడదు. సత్తుపల్లి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు అత్యధిక సార్లు తుమ్మల నాగేశ్వరరావుకు, జలగం సోదరులకు మధ్యే పోటీ ఉండేది. 
 
జలగం ప్రసాదరావు ఒకసారి మంత్రి అయితే, తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎన్.టి.ఆర్, చంద్రబాబుల మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు.