శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:10 IST)

భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ నోటీసులు - అరెస్టు చేసే ఛాన్సెస్

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయాన

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయానికి భూమన అక్కడ లేరు. భూమన ఇంటిలోని వారు కూడా నోటీసులు తీసుకోలేదు. 
 
దీంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇంటి వద్దే అంటించి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తుని సంఘటనలో ఇప్పటికై ప్రధాన పాత్రగా భూమన కరుణాకర్‌ రెడ్డిని సిఐడీ అనుమానిస్తోంది. భూమన ఫోన్‌ను కూడా సీఐడీ ట్యాప్‌ చేసింది. ఈనెల 6, 7 తేదీలలో రెండురోజుల పాటు భూమనను కూడా సిఐడీ విచారించింది. అయితే ఈసారి సీఐడీ అధికారులు భూమనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.