చంద్రబాబు బ్లూ ప్రింట్... ప్రజల కలలు సమాధి... జగన్ ఫైర్ ట్వీట్..!
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. జగన్ ఇటీవల ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈయన తొలి ట్వీట్నే చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ప్రారంభమైంది. తాజాగా మరో వైపు ట్విట్టర్లో చంద్రబాబుపై జగన్ తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కలలను నెరవేర్చుకునేందుకే ఓ బ్లూప్రింట్ను రూపొందించారని జగన్ ట్విట్టర్లో విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ కలలను నిజం చేసుకునేందుకు చంద్రబాబు ఓ బ్లూప్రింట్ తయారుచేశారు. అయితే ఆ బ్లూప్రింటులో లక్షల మంది ప్రజల కలలను సమాధి చేయడాన్ని నేను చూస్తున్నా అని జగన్ ట్వీట్ చేశారు.