శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (18:02 IST)

స్పెయిన్ పర్యటనలో వెంకయ్య.. బార్సిలోనాలో బ్యాగు చోరీ!

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పెయిన్ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో వెంకయ్య బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు బార్సిలోనాలో చోరీ చేశారు. 
 
స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన ఓ హోటల్‌లో బసచేశారు. ఆయన బస చేసిన హోటల్ లాబీల్లోనే ఆయన బ్యాగును ఎవరో దొంగిలించారు. 
 
చోరీకి గురైన బ్యాగ్‌లో పాస్ పోర్టు, ఇతర పత్రాలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. దీంతో, భారత ఎంబసీ అధికారులు స్పందించి ఆయనకు కొత్త పాస్ పోర్టు, ఇతర పత్రాలు సిద్ధం చేసి ఇచ్చారు.