బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (13:25 IST)

అమ్మాయికి మొబైల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. బలవన్మరణానికి..?

రాజస్థాన్‌లో ఓ బాలుడు అమ్మాయికి సెల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్ బుండి పట్టణంలో 14 ఏళ్ల బాలుడు అనిల్ బైర్వా.. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయికి స్నేహితుడి ద్వారా మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అతడి ప్రాణాలను బలితీసుకుంది. 
 
ఆ అమ్మాయి తండ్రి ఓ టీచర్. కుమార్తె వద్ద కొత్తగా మొబైల్ కనిపిస్తుండడంతో దాని గురించి అడిగాడటంతో బాలుడి పేరును ఆ అమ్మాయి వెల్లడించింది. వెంటనే, ఉపాధ్యాయుడు ఆగ్రహంతో అనిల్ ఇంటికెళ్లాడు. మరోసారి ఇలా చేయవద్దంటూ బాలుడిని అతడి తండ్రి ముందే హెచ్చరించాడు.
 
మనస్తాపం చెందిన ఆ విద్యార్థి కొన్ని గంటల తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ సూసైడ్ నోట్‌లో బాలుడు ఎవరినీ తప్పుబట్టలేదని, అయినప్పటికీ  అటు, అనిల్ తండ్రి తన కుమారుడి చావుకు బాలిక, ఆమె తండ్రే కారణమని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.