వాకతిప్ప బాణాసంచా పేలుడులో 18కు చేరిన మృతుల సంఖ్య!
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతులలో 14 మంది మహిళలే కావడం గమనార్హం. ఈ దుర్ఘటనలో సోమవారం 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మంగళవారం తెల్లవారే సమయానికి మృతి చెందారు.
ఇదిలావుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కాకినాడ ఆస్పత్రికి వస్తున్నారు.