మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (20:00 IST)

వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలి: స్పీకర్

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. "రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే విషయం చెప్పారు. దానికే నేను కట్టుబడి వున్నాను. 
 
వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలి. సభాపతిగా నా వైఖరి కూడా అదే. ఏపీలో శాసనసభ, శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టాం" అని తెలిపారు.