బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (10:42 IST)

నేటి నుంచి వెంకయ్య నాయుడు విదేశీ పర్యటన

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నుంచి విదేశీ పర్యటనకు చేపట్టనున్నారు. రవాణా, స్థల నిర్వహణకు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఆదివారం పారిస్‌ వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే 'తెలివైన రవాణా వ్యవస్థ దిశగా' అనే సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
వ్యాపార, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, రవాణా రంగం ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రవాణా రంగంలో వివిధ దేశాలు చేసిన ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన 'నాయక త్రయం' పుస్తకాన్ని ఈ నెల 4వ తేదీ హైదరాబాద్‌లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించాల్సి ఉండగా విదేశీ పర్యటన వల్ల ఈ కార్యక్రమం వాయిదాపడింది.