శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:06 IST)

విపక్షాలకు స్వప్రయోజనాలే ముఖ్యం : మంత్రి వెంకయ్య నాయుడు

దేశంలోని విపక్ష పార్టీలకు దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... లోక్‌సభలో తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఒక్క సెషన్‌లోనే రికార్డు స్థాయిలో 17 కీలక బిల్లులకు ఆమోదం లభించిందని ఆయన చెప్పారు.
 
ప్రభుత్వ పాలనలో పలు కీలక సంస్కరణలకు దోహదం చేసే బిల్లుల ఆమోదానికి విపక్షాలు మోకాలడ్డుతున్నాయన్నారు. దీనికి కారణమే రాజ్యసభలో అనేక బిల్లులను అడ్డుకుంటున్నాయని చెప్పారు. దీనికి కారణం ప్రస్తుత సెషన్‌లో రాజ్యసభలో 11 బిల్లులకు మాత్రమే ఆమోదం లభించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని వెంకయ్య సూచించారు. రాజ్యసభలో కాస్త ఎక్కువ బలం ఉన్న విపక్షాలు, కీలక బిల్లులకు అడ్డుపడుతున్నాయన్నారు.