శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (08:46 IST)

స్టిక్ పట్టి గోల్ఫర్‌‌గా మారిన వెంకయ్య.. ఆసక్తిగా తిలకించిన సురేష్ ప్రభు!

నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు గోల్ఫర్‌గా మారిపోయారు. చేత స్టిక్ పట్టి.. గోల్ఫ్ ఆడారు.

నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు గోల్ఫర్‌గా మారిపోయారు. చేత స్టిక్ పట్టి.. గోల్ఫ్ ఆడారు. వెంకయ్య గోల్ఫ్ ఆడుతుంటే కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో పాటు.. ఏపీ పురపాలక శాఖామంత్రి పి నారాయణలు ఆసక్తిగా తిలకించారు. ఈ అరుదైన దృశ్యం ఆదివారం కృష్ణాపట్నం పోర్టులో కనిపించింది. 
 
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో కొత్తగా గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలతో కలిసి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 
 
సముద్ర తీరం వెంట నిర్మించిన ఈ గోల్ఫ్ కోర్సును ఆసక్తిగా పరిశీలించిన వెంకయ్య... పోర్టు యాజమాన్యాన్ని అభినందించారు. ఆ తర్వాత సురేశ్ ప్రభు, నారాయణలతో కలిసి గోల్ఫ్ స్టిక్ పట్టిన వెంకయ్య... కాసేపు గోల్ఫ్ ఆడారు. తలపై టోపీ పెట్టుకుని వెంకయ్య గోల్ఫ్ ఆడిన తీరును అక్కడి వారు ఆసక్తిగా తిలకించారు.