గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (13:05 IST)

దుర్గ గుడి పవిత్రతను మంటగలిపాడు: మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూస్తూ..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ గుడి పవిత్రతను ఓ సీఐ మంటగలిపాడంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ ప్రసాద్ గుడి ఆవరణలో మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కాడు. బందోబస్తు విధుల్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని భక్తులు సదరు సీఐపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా.. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. 
 
సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూస్తుండగా అక్కడే వున్న మీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. సీఐ చేసిన ఈ ఘనకార్యం బయటకి పొక్కడంతో అధికారులు అతనని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.