విశాఖపట్నంలో వాల్ మార్ట్: సీఈఓ క్రిష్ అయ్యర్
విశాఖపట్నంలో ఒకటి, పంజాబ్లోని లుథియానాలో మరొక వాల్ మార్ట్ స్టోర్ను నెలకొల్పుతున్నట్లు వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా రిటైల్ అమ్మకాల దిగ్గజమైన వాల్ మార్ట్ భారత్లో రెండో హోల్ సేల్ స్టోర్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. ఇందులో ఒకటి విశాఖలో ఏర్పాటు కానుంది.
దీనిపై క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో.."ఈ రెండు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంతర్గత అనుమతులు ఇటీవలే లభించాయి. ఒక స్టోర్ను విశాఖలో, రెండో స్టోర్ను పంజాబ్ నగరం లుథియానాలో ప్రారంభిస్తున్నాం" అని వివరించారు. సంబంధిత లైసెన్సులు, ఇతర అనుమతులను పొందేందుకు ఓ బృందం పనిచేస్తోందని తెలిపారు.