శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (11:02 IST)

నావల్లే ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం : బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే,  బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారని అన్నారు.
 
గాజువాకలో జరిగిన బీజేపీ మహావిశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల మంత్రులు చంద్రబాబుతో భేటీ అయ్యారని... ఆ సందర్భంలో చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగిందని... ఆ చర్చలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏంటని తాను ప్రస్తావించానని చెప్పారు. దీంతో, ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు.