శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:27 IST)

ఓటుకు నోటు కేసు: కొత్త వ్యక్తి జిమ్మీకి నోటీసులు.. బాబుకు కూడా..?

ఓటుకు నోటు కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో.. తాజాగా ఎమ్మెల్యే సండ్రతో పాటు జిమ్మీ అనే వ్యక్తికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రంలోపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సెబాస్టియన్‌ను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వద్దకు తీసుకొచ్చి, పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ అని స్టీఫెన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. ఈ కేసులో జిమ్మీ పాత్ర ఏంటి.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేగాకుండా అతనికి రాజకీయాల్లో ఉన్న సంబంధాలు ఇతరత్రా అంశాలపై ఏసీబీ విచారణలో తేలనుంది. మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ పరీక్ష చేయించిన ఏసీబీ.. త్వరలో ఆయనకు కూడా నోటీసులు పంపే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 

అలాగే టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.