శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (09:53 IST)

డాడీ.. నీ ఫ్రెండే వేధిస్తున్నాడు.. నీతో చెప్పుకోలేక చచ్చిపోతున్నా...

కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర

కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో గూడూరు రవి అనే వ్యక్తికి ఇంటర్ చదివే గూరుడు భవాని అనే కుమార్తె ఉంది. స్థానికంగా ఉండే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
భవానీ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో రవి స్నేహితుడు అదే ప్రాంతానికి చెందిన వడ్డెపల్లి సంతోష్ ప్రేమ పేరుతో వేధించసాగాడు. పైగా, సంతోష్‌నే పెళ్లి చేసుకోవాలంటూ అతని ఇంటిపక్కన ఉండే పోరండ్ల భిక్షపతి కూడా ఒత్తిడి చేయసాగాడు. 
 
అటు సంతోష్.. ఇటు భిక్షపతి వేధింపులు భరించలేని భవానీ.. మంగళవారం రాత్రి ఇంట్లోనే తన చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 'డాడీ.. నీ ఫ్రెండే నన్ను టార్చర్‌ చేస్తున్నాడు. నీకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని సూసైడ్ నోట్‌లో రాసిపెట్టి ఈ దారుణానికి పాల్పడింది. 
 
కుమార్తె ఆత్మహత్యపై తండ్రి రవి ఫిర్యాదు మేరకు వడ్డెపల్లి సంతోష్‌, భిక్షపతిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.