శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (06:17 IST)

పట్టిసీమకు మేము పూర్తి వ్యతిరేకం.. గతంలో కూడా చెప్పాం.. జగన్

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా స్పష్టం చేశామని అన్నారు. పట్టిసీమలో స్టోరేజీ లేదని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
పట్టిసీమ కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారన్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లలో 21.9 శాతం ఎక్కువ వేశారని వెల్లడించారు. సెలక్టివ్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్‌చేశారని ఆరోపించారు. పైపులు, పంప్‌లు తగ్గితే ధర తగ్గదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ పరిధిలోకి వెళ్తుందన్నారు.