శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2016 (10:07 IST)

పెళ్లైన మూడు రోజులకే వధువు మృతి.. పెద్దల అంగీకారంతోనే ప్రేమ పెళ్ళి.. ఏమైందో?

పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధ

పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధువుల రోదనతో శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రేమించి పెళ్లాడిన భర్త ఆమె మృతికి కారణమయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. ఈ ఘటన పశ్చిమగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల శైలజ (22)కు బుధవారం వివాహం కాగా శనివారం నాటికి మృత్యు ఒడికి చేరింది.
 
పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల నారాయణరావు కుమారై శైలజకు శృంగవృక్షం గ్రామానికి చెందిన కవురు ఏసుబాబుతో బుధవారం ఈ నెల 17న వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. కాగా శనివారం మధ్యా హ్నం కొత్త దంపతులు గొడవపడ్డారు.

గొడవ జరిగిన కొద్ది సేపటికే శైలజ పడకగదిలో ఉరివేసుకుని ఉందని, తాము చూసేసరికి మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. శైలజ తండ్రి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఏసుబాబును అదుపులోకి తీసుకున్నారు.