శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (10:40 IST)

ఐదేళ్ల వివాహేతర సంబంధం.. భార్యను జుట్టుపట్టుకుని బయటికి గెంటేశాడు..

వివాహేతర సంబంధం కారణంగా తన భర్త తన ఆస్తులన్నీ ఆమెకే రాసివ్వడంపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం కలిగివున్నాడని.. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు ఆమెకే ఇళ్లు, ఫ్లాట

వివాహేతర సంబంధం కారణంగా తన భర్త తన ఆస్తులన్నీ ఆమెకే రాసివ్వడంపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం కలిగివున్నాడని.. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు ఆమెకే ఇళ్లు, ఫ్లాట్లు రాసిచ్చాడని బాధిత మహిళల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా, లింగసముద్రం గ్రామానికి చెందిన కామినేని సుజాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
సుజాత భర్త కామినేని చిన అంజయ్య లింగసముద్రం పంచాయతీలోని బలిజపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళతో ఐదేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఈనెల 24న సుజాత ఇంటికి వెళ్లి నీ భర్త అంజయ్య ఇంటిని, రెండు ఫ్లాట్లుని తన పేరున రాసిచ్చాడని.. తక్షణం ఇంటిని ఖాళీ చేయాలంది. అందుకు సుజాత నిరాకరించడంతో సుజాతను జుట్టు పట్టుకుని భర్త గెంటేశాడు. ఇకపోతే.. సుజాత ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్త అంజయ్య, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.