శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:22 IST)

ఆరు పదుల వయస్సులో భార్యాభర్తల మధ్య గొడవలు.. భర్త తలను నరికేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అయితే ఈ గొడవల కారణంగా ఓ భార్య భర్త తలను నరికేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామానికి చెందిన దయ్య

భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అయితే ఈ గొడవల కారణంగా ఓ భార్య భర్త తలను నరికేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామానికి చెందిన దయ్యాల లచ్చయ్య (60), దయ్యాల బాలవ్వ దంపతులు. 
 
వీరిమధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో పూర్తిగా విసిగిపోయిన బాలవ్వ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. నిద్రపోతున్న తన భర్త తలను గొడ్డలితో నరికేసింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఆరు పదుల వయస్సులో గొడవలేంటని.. ఆ గొడవలకు గల కారణాలేంటి? భర్తను భార్య చంపేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విభిన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే... బెంగళూరులోని కొత్తనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బనశంకరి ప్రాంతంలో ఉన్న నాగేనహళ్లిలో గగుర్పాటుకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. భార్య అందంగా ఉందని.. ఆమెను అందరూ చూస్తున్నారని సహించుకోలేని ఓ భర్త.. ఆమె కంటిని కత్తితో పీకేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.