శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:25 IST)

భర్త వేధించాడు.. ఆమె చేతిలోనే హతమైనాడు!

భర్త  వేధించాడు... ఫలితంగా ఆతని భార్యే అతనిని చంపేసింది. ఎంతకాలం ఈ వేధింపులను తట్టుకుంటాం.. ఒక దశకు వేధింపులు భరించింది. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకుని తలపై రాయితో మోది హత్య చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
దస్తగిరి, చిట్టెమ్మ అనే దంపతులు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే దస్తగిరి ఎంతోకాలంగా భార్యమీద అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ అంశం మీద ప్రతిరోజూ ఇద్దరి మధ్య గొడవ జరిగేది. 
 
భర్త వేధింపులు మితిమీరడంతో చిట్టెమ్మ ఆదివారం దస్తగరి తలపై రాయినేసి హతమార్చింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.