మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:20 IST)

వేధిస్తున్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య!

అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడన్న అక్కసుతో నిద్రపోతున్న భర్తను ఓ భార్య కాటికి కడతేర్చింది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమె ఈ దారుణానికి తెగబడింది. భర్త తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేసింది. ఈ దారుణం కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పత్తికొండ సవరమ్మ కాలనీలో చిట్టెమ్మ, దస్తగిరి అనే దంపతులు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే దస్తగిరి భార్యపై అనుమానంతో నిత్యం చిట్టెమ్మను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఫలితంగా వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పినా ఈ వివాదానికి తెరపడలేదు. 
 
ఈ నేపథ్యంలో భర్త వేధింపులు మితిమీరటంతో సహనం కోల్పోయిన చిట్టెమ్మ నిద్రిస్తున్న గత అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది హత్య చేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దస్తగిరి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.