శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (09:21 IST)

పుదుచ్చేరి ఓటర్లకు ధన్యవాదాలు.. పరాజయంపై ఆత్మశోధన : సోనియా

పుదుచ్చేరి ఓటర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అదేసమయంలో అసోం, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవంపై అత్మశోధన చేసుకుంటామని ఆమె ప్రకటించారు. 
 
గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ... 'అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ ఓటమికి కారణాలేమిటో విశ్లేషించుకుంటాం. మరింత ఉత్తేజంతో ప్రజాసేవకు పునరంకితమవుతాం' అని వ్యాఖ్యానించారు. 
 
'అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళల్లో ప్రజల తీర్పును సవినయంగా స్వీకరిస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో ఓటర్ల ఉత్సాహాన్ని హర్షిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు.. అదేసమయంలో తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన పుదుచ్చేరిన ఓటర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు.