మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (10:55 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమల స్థాపనకు విప్రో రెడీ!

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు స్థాపించేందుకు విప్రో సంస్థ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఐటీ పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నామని, రెండు రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది.

పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు విప్రో అధికారి ప్రేమ్‌జీ వినతి పత్రాలు అందజేశారు. 
 
ప్రేమ్‌జీ విన్నపాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వీకరించారు. విప్రో వినతులపై సానుకూలంగా స్పందించారు. ఐటి పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక సదుపాయాలతోపాటు స్థలాలు కేటాయించాలని ప్రేమ్‌జీ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు కెసిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.