తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పీవీ సింధు.. సానియా మీర్జా కథ కంచికేనా?
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో ధీటుగా రాణించి రజత పతకాన్ని సొంతం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్ 2016లో సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం గెలవాలని యావత్ భారత
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో ధీటుగా రాణించి రజత పతకాన్ని సొంతం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్ 2016లో సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం గెలవాలని యావత్ భారత దేశం పూజలు చేసింది. అందరి పూజలు ఫలించాయి. స్వర్ణం కాకపోయినా రజతంతో దేశానికి గుర్తింపు సంపాదించిపెట్టింది. ఈ నేపథ్యంలో పీవీ సింధు క్రేజ్తో ఫ్యాన్స్ ఇద్దరు క్రీడాకారిణిలను టార్గెట్ చేస్తున్నారు.
అందులో ఒకరు సైనా నెహ్వాల్. మరొకరు సానియా మీర్జా. ఇప్పటికే సైనా పైన ఓ క్రీడాభిమాని.. సైనా బ్యాగ్ సర్దుకొని రావాలని ట్వీట్ చేశారు. దానికి సైనా హుందాగా సమాధానం చెప్పింది. అలాగే చేస్తానని బదులిచ్చింది. దీంతో సదరు అభిమాని పశ్చాత్తాపపడ్డాడు.
మరోవైపు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కూడా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జా స్థానంలో మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే పీవీ సింధుని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ.. ఫేస్బుక్లో ఓ కామెంట్, ఫోటో హల్ చల్ చేస్తోంది. సామాజిక మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా పీవీ సింధు పేరుకు సూపర్ క్రేజ్ లభించిన తరుణంలో సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
సంప్రదాయాలకు విలువనిచ్చే పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు నియమించకూడదని చర్చ మొదలు కావడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ సానియాను బ్రాండ్ అంబాసిడర్గా తొలగించి పీవీ సింధును ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం.