శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (17:10 IST)

కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?

కృష్ణా జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. అత్తమామలు కలిసి తమ కోడలిని చంపి కాలువగట్టున పూడ్చిపెట్టారు. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ హతురాలు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వ్యక్తి భార్యగా భావిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బరంకులకు చెందిన వంశీకృష్ణ భార్య వరలక్ష్మి మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీనిపై వంశీకృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోయారు.
 
అయితే, వరలక్ష్మి తల్లిదండ్రులు మాత్రం రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. వరలక్ష్మి అదృశ్యాన్ని తేల్చాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు వరలక్ష్మి అదృశ్యం మిస్టరీని చేధించారు. వరలక్ష్మిని అత్తామామలు కలిసి హత్య చేసి స్థానికంగా ఉండో ఓ పంట కాల్వకు సమీపంలోనే పాతిపెట్టినట్టు కనుగొన్నారు. విషయం వెలుగులోకి రావడంతో వంశీకృష్ణ కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.