గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 మే 2016 (09:14 IST)

పెద్దల గొడవలే ఓ వివాహిత ప్రాణాలు బలిగొన్నాయి.. చున్నీతో ఉరేసుకుని..?

పంతాలు, పట్టింపులకు పోయి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన శ్రేతావర్మ (26), యూపీకి చెందిన పవన్‌కుమార్‌కు (32) మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వివాహ సమయంలో ఇరు కుటుంబాలకు గొడవలుండేవి. 
 
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. సోమవారం ఉదయం యూపీలో ఉన్న పవన్‌కుమార్ బంధువులకు ఆరోగ్యం బాగా లేదని చూసేందుకు వెళ్దామని యూపీకి ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేశారు. 
 
కానీ యూపీకి వెళ్లేందుకు శ్రేతాశర్మ అంగీకరించకపోవడంతో పాటు తన చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. శ్రేతాశర్మ మృతికి పెద్దల గొడవే కారణమని పోలీసులు చెప్తున్నారు.