బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (16:34 IST)

భర్త కాపురానికి తీసుకెళ్లలేదు.. పోలీసులు పట్టించుకోలేదు.. వివాహిత ఆత్మహత్య

పోలీస్ స్టేషన్లోనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త కాపురానికి తీసుకెళ్లట్లేదని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన ఒక వివాహిత పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. భర్త సుదర్శన్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ హారిక (25) అనే మహిళ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. 
 
అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు తన ఆవేదనను చెప్పేందుకు వెళ్లింది. అక్కడ సుమారు రెండు గంటల పాటు రెండు గంటల పాటు ఎదురుచూసినా సీఐ రాకపోవడంతో మనస్తాపానికి గురైన హారిక పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.