శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (11:06 IST)

అనంతలో గర్భిణికి స్వైన్ఫ్లూ లక్షణాలు, శిశువు మృతి

అనంతపురం స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో తనకల్లు మండలం బత్తులపల్లికి చెందిన నాగేశ్వరి అనే గర్భిణి ఆస్పత్రిలో చేరింది. కాగా గర్భంలోనే శిశువు మృతి చెందగా, నాగేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
మరోవైపు స్వైన్ఫ్లూ పై బీఎంఅండ్ హెచ్ఓలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న స్వైన్ఫ్లూ కేసులపై ఆరా తీశారు. అన్ని జిల్లా ఆస్పత్రులలోనూ స్వైన్ఫ్లూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.