శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (18:13 IST)

ప్రియుడి కోసం భర్తను వదిలి గడప దాటింది.. ప్రియుడు ముఖం చాటేశాడు.. ఆపై?

ప్రియుడు తనను బాగా చూసుకుంటాడని నమ్మి భర్తను వదిలి.. ప్రియుడి వెంట వెళ్లిన యువతికి చుక్కలు కనిపించాయి. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత

ప్రియుడు తనను బాగా చూసుకుంటాడని నమ్మి భర్తను వదిలి.. ప్రియుడి వెంట వెళ్లిన యువతికి చుక్కలు కనిపించాయి. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాలోని పెద్దంపేట గ్రామానికి చెందిన పోలుదాసరి జ్యోతిని అదే గ్రామానికి చెందిన పెద్దు శివకుమార్ పెళ్ళిచేసుకొంటానని శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
అయితే వీరిద్దరి కులాలు వేరుకావడంతో శివకుమార్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే జ్యోతి తల్లి చనిపోవడంతో తండ్రి ఓదెలు ఆమెను పెంచాడు. అయితే బంధువులు, గ్రామస్థుల సాయంతో జ్యోతిని వేరే వ్యక్తికి ఓదెలు పెళ్ళి చేశాడు. జ్యోతికి వివాహమైన తర్వాత కూడా జ్యోతిని శివకుమార్ తరచూ రమ్మని ఫోన్ చేసేవాడు. దీంతో భర్తతో కాపురం చేయలేక ప్రియుడి కోసం సిద్ధం పేటకు చేరుకుంది జ్యోతి. అయితే ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో శివకుమార్‌తో జీవిస్తానని జ్యోతి తేల్చి చెప్పేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.